Indian navy | నౌకాదళ చరిత్రను గుర్తుచేసే పర్వదినం.. ప్రతి భారతీయుడికి గర్వకారణం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian navy | ఇండో-పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 4, 1971లో భారత్ సాధించిన చారిత్రక విజయానికి సరిగ్గా 54 సంవత్సరాలు పూర్తవుతుంది. దేశానికి గర్వకారణమైన భారత నౌకాదళం (Indian Navy) పాత్రను, అద్భుత విజయాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజున భారత నౌకాదళ దినోత్సవం (నేవీ డే) జరుపుకుంటారు. ఆపరేషన్ ట్రైడెంట్‌ను (Operation Trident) ప్రారంభించిన జ్ఞాపకార్థం, దేశం కోసం ధైర్యంగా పోరాడి మరణించిన సైనికులను స్మరించుకోవడానికి కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian navy | ఇండో-పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 4, 1971లో భారత్ సాధించిన చారిత్రక విజయానికి సరిగ్గా 54 సంవత్సరాలు పూర్తవుతుంది.

దేశానికి గర్వకారణమైన భారత నౌకాదళం (Indian Navy) పాత్రను, అద్భుత విజయాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజున భారత నౌకాదళ దినోత్సవం (నేవీ డే) జరుపుకుంటారు. ఆపరేషన్ ట్రైడెంట్‌ను (Operation Trident) ప్రారంభించిన జ్ఞాపకార్థం, దేశం కోసం ధైర్యంగా పోరాడి మరణించిన సైనికులను స్మరించుకోవడానికి కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇండియన్ నేవీ డే చరిత్ర: భారత నౌకాదళం చరిత్ర 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company) స్థాపనతో మొదలైంది. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ సమయంలో, డిసెంబర్ 3న పాకిస్థాన్ భారత వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగా, భారత నావికాదళం డిసెంబర్ 4, 5 తేదీల రాత్రి ‘ఆపరేషన్ ట్రైడెంట్ దాడి కోసం ప్రణాళికను రూపొందించింది.

ఈ ఆపరేషన్ సమయంలో, కరాచీలోని పాకిస్థాన్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఎన్ఎస్ వీర్, ఐఎన్ఎస్ నిపాట్, ఐఎన్ఎస్ నిర్ఘాట్ అనే మూడు క్షిపణి పడవలను ఉపయోగించారు. అప్పటి పాకిస్థాన్ వద్ద బాంబు దాడి చేసే విమానాలు లేకపోవడం భారత్‌కు అనుకూలించింది. కమాండర్ కాసర్గోడు పట్టనశెట్టి గోపాల్ రావు నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, భారత నౌకాదళం శత్రు సైన్యానికి చెందిన కీలక నౌకలను ముంచి, విజయం సాధించింది. మే 1972లో జరిగిన సీనియర్ నౌకాదళ అధికారుల సమావేశంలో, 1971 యుద్ధంలో నౌకాదళం చేసిన అపారమైన కృషిని గౌరవిస్తూ డిసెంబర్ 4ను ‘నేవీ డే’గా నిర్ణయించారు.

ప్రాముఖ్యత : నివాళులు, అవగాహన: దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేవీ సిబ్బందికి నివాళులు అర్పించడానికి, వారి సేవ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు.

వేడుకలు: ఈ రోజున ఇండియన్ నేవీ పశ్చిమ నౌకాదళ కమాండ్ (Western Naval Command) ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సమావేశమై తమ నౌకలు, సైనికులతో వేడుకలు జరుపుకుంటారు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కూడా భారత నౌకాదళం శక్తిని, ప్రాముఖ్యతను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రపంచంలో భారత నౌకాదళం స్థానం: భారత నౌకాదళం (పూర్వపు రాయల్ ఇండియన్ నేవీ) నేడు ప్రపంచంలోనే ఏడవ అత్యంత బలమైన నౌకాదళంగా ఎదిగింది. దీనికి INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి శక్తివంతమైన విమాన వాహక నౌకలు ఉన్నాయి.

భారత నౌకాదళం ముఖ్య విధి దేశం సముద్ర సరిహద్దులను పటిష్టంగా భద్రపరచడం. అంతేకాకుండా, విపత్తు సహాయం, పర్యటనలు, పెట్టుబడులు వంటి వాటి ద్వారా ప్రపంచ దేశాలతో భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో కూడా నౌకాదళం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...