Cyclone Senyar | తుపాన్​గా మారిన వాయుగుండం.. భారీ వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Senyar | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్​గా మారింది. దానిని సెన్యార్​ తుపాన్​ (Cyclone Senyar) అని పేరు పెట్టారు. సెన్యార్​ ప్రస్తుతం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతోంది. 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. మలేషియా సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం తుపాన్​గా మారింది. దీనికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సెన్యార్‌ అని పేరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Senyar | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్​గా మారింది. దానిని సెన్యార్​ తుపాన్​ (Cyclone Senyar) అని పేరు పెట్టారు. సెన్యార్​ ప్రస్తుతం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతోంది. 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.

మలేషియా సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం తుపాన్​గా మారింది. దీనికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సెన్యార్‌ అని పేరు పెట్టినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ దిశగా కదులుతున్న తుపాన్​ ఇండోనేషియా (Indonesia) తీరం వైపు వెళ్లనుంది. దీని ప్రభావం భారత్​పై తక్కువగా ఉంటుందని అంచాన వేస్తున్నారు. అయితే తీరం వెంబడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Cyclone Senyar | మరో అల్పపీడనం

ఇప్పటికే తుపాన్​ దూసుకు వస్తుండగా.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే ఛాన్స్​ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...