Cyclone Ditwah | దిత్వా తుపాన్​ ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో (southwest Bay of Bengal) ఏర్పడిన దిత్వా తుపాన్​ క్రమంగా బలహీన పడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దిత్వా తుపాన్​ (Cyclone Ditva) గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పయనం చేస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 50 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతంలో (southwest Bay of Bengal) ఏర్పడిన దిత్వా తుపాన్​ క్రమంగా బలహీన పడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దిత్వా తుపాన్​ (Cyclone Ditva) గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పయనం చేస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి (Puducherry) 150 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్​ ఉందని అధికారులు తెలిపారు.

దిత్వా తుపాన్​ ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దన్నారు. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా దిత్వా తుపాన్​ కారణంగా తెలంగాణలో సైతం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...