Cyber Crime | రేటింగ్​ ఇస్తే కమీషన్​ అని చెప్పి.. రూ.54 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime | సైబర్​ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది అత్యాశకు పోయి సైబర్​ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఓ ఐటీ ఉద్యోగి నుంచి సైబర్​ నేరస్తులు ఏకంగా రూ.54 లక్షలు కాజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. పటాన్​చెరులో నివాసం ఉంటున్న ఆయనకు సెప్టెంబర్​ 5న […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime | సైబర్​ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది అత్యాశకు పోయి సైబర్​ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారు.

సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఓ ఐటీ ఉద్యోగి నుంచి సైబర్​ నేరస్తులు ఏకంగా రూ.54 లక్షలు కాజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. పటాన్​చెరులో నివాసం ఉంటున్న ఆయనకు సెప్టెంబర్​ 5న టెలిగ్రామ్​లో మెసేజ్ వచ్చింది. బ్రాండెడ్​ కంపెనీలకు రేటింగ్​ ఇస్తే కమీషన్​ ఇస్తామని అందులో ఉంది. దీంతో ఆయన నమ్మి వారిని సంప్రదించారు. దీనికోసం మొదట కొంత మొత్తం ఇన్వెస్ట్​ చేయాలని నిందితులు నమ్మించారు.

 Cyber Crime | విడతల వారీగా..

సైబర్​ దొంగలు చెప్పింది నమ్మిన ఆ ఐటీ ఉద్యోగి మొదట రూ.5 వేలు వారు చెప్పిన ఖాతాకు పంపించాడు. దీంతో నిందితులు రూ.7 వేల లాభం వచ్చిందని చెప్పారు. మొత్తం రూ.12 వేలు అతడి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో ఇది నిజమని సదరు వ్యక్తి నమ్మాడు. విడతల వారీగా రూ.54 లక్షలు అందులో ఇన్వెస్ట్​ చేశాడు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి

సైబర్​ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్​లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్​ చేసి తాము పోలీసులం, సీబీఐ ​ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. ట్రేడింగ్​, కమీషన్లు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, పార్ట్​టైం జాబ్​ల పేరిట సైబర్​ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అలా ఫోన్​ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్​ 1930కి సమాచారం అందించాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...