Homeక్రైంCyber Crime | రేటింగ్​ ఇస్తే కమీషన్​ అని చెప్పి.. రూ.54 లక్షలు కాజేసిన సైబర్​...

Cyber Crime | రేటింగ్​ ఇస్తే కమీషన్​ అని చెప్పి.. రూ.54 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

Cyber Crime | సైబర్​ నేరస్తులు ఓ ఐటీ ఉద్యోగికి టోకరా వేశారు. రేటింగ్​ ఇస్తే కమీషన్​ ఇస్తామని చెప్పి రూ.54 లక్షలు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime | సైబర్​ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది అత్యాశకు పోయి సైబర్​ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారు.

సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఓ ఐటీ ఉద్యోగి నుంచి సైబర్​ నేరస్తులు ఏకంగా రూ.54 లక్షలు కాజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. పటాన్​చెరులో నివాసం ఉంటున్న ఆయనకు సెప్టెంబర్​ 5న టెలిగ్రామ్​లో మెసేజ్ వచ్చింది. బ్రాండెడ్​ కంపెనీలకు రేటింగ్​ ఇస్తే కమీషన్​ ఇస్తామని అందులో ఉంది. దీంతో ఆయన నమ్మి వారిని సంప్రదించారు. దీనికోసం మొదట కొంత మొత్తం ఇన్వెస్ట్​ చేయాలని నిందితులు నమ్మించారు.

 Cyber Crime | విడతల వారీగా..

సైబర్​ దొంగలు చెప్పింది నమ్మిన ఆ ఐటీ ఉద్యోగి మొదట రూ.5 వేలు వారు చెప్పిన ఖాతాకు పంపించాడు. దీంతో నిందితులు రూ.7 వేల లాభం వచ్చిందని చెప్పారు. మొత్తం రూ.12 వేలు అతడి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో ఇది నిజమని సదరు వ్యక్తి నమ్మాడు. విడతల వారీగా రూ.54 లక్షలు అందులో ఇన్వెస్ట్​ చేశాడు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి

సైబర్​ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్​లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్​ చేసి తాము పోలీసులం, సీబీఐ ​ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. ట్రేడింగ్​, కమీషన్లు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, పార్ట్​టైం జాబ్​ల పేరిట సైబర్​ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అలా ఫోన్​ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్​ 1930కి సమాచారం అందించాలని సూచించారు.