Homeతాజావార్తలుcyber crime | హైదరాబాద్​లో మరో భారీ సైబర్ మోసం.. ఫ్రెండ్​ రిక్వెస్ట్​తో రూ. 14...

cyber crime | హైదరాబాద్​లో మరో భారీ సైబర్ మోసం.. ఫ్రెండ్​ రిక్వెస్ట్​తో రూ. 14 కోట్లు స్వాహా

cyber crime | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారి ఆగడాలకు అడ్డు ఉండటం లేదు.

- Advertisement -
అక్షరటుడే, హైదరాబాద్​: cyber crime | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారి ఆగడాలకు అడ్డు ఉండటం లేదు.
ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. అమాయకులు మోసపోతూనే ఉన్నారు. సైబర్​ నేరగాళ్ల చెరలో పడిన వారిలో సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం ఆందోళనకరం. తాజాగా హైదరాబాద్​లో మరో భారీ సైబర్​ మోసం వెలుగుచూసింది.
ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చెరలో చిక్కి భారీ మొత్తంలో డబ్బు పోగుట్టుకున్నాడు. ఇన్వెస్ట్​మెంట్​ల పేరుతో సుమారు రూ.14 కోట్లను వైద్యుడి నుంచి సైబర్​ నేరగాళ్లు కొల్లగొట్టారు.

cyber crime | ఫేక్​ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ లింక్

ఈ సైబర్​ నేరగాళ్లు మొదట బాధిత వైద్యుడికి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అయ్యారు. మోనిక మాధవన్ అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో వైద్యుడికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపించారు.
అనంతరం ఫేక్​ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ లింక్ సెండ్​ చేశారు. భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు వైద్యుడిని నమ్మబలికారు. కానీ, నగదు విత్‌ డ్రా చేయాలంటే పన్ను (ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వైద్యుడు పట్టించుకోకపోవడంతో పన్ను కట్టాల్సిందేనని ఒత్తడి తీసుకొచ్చారు. దీంతో సైబర్​ నేరగాళ్లు అడిగిన మొత్తాన్ని చెల్లించాడు బాధిత వైద్యుడు.

కాగా, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించినా కూడా అవతలివారు డబ్బులు పంపించకపోవడంతో అనుమానం వచ్చి సైబర్​ క్రైమ్ బ్రాంచ్​కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుడు రూ. 14 కోట్లు పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News