Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | దేవిమాత నిమజ్జన శోభాయాత్రలో సీపీ ప్రత్యేకపూజలు

Nizamabad CP | దేవిమాత నిమజ్జన శోభాయాత్రలో సీపీ ప్రత్యేకపూజలు

అక్షరటుడే, బోధన్: Nizamabad CP | బోధన్​ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర (Durga Devi Nimajjana Shobhayatra) అంగరంగ వైభవంగా సాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు సలహాలు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేవరకు సిబ్బంది అలర్ట్​గా ఉండాలని సూచించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. సీపీ వెంట బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, టౌన్​ సీఐ వెంకట నారాయణ తదితరులున్నారు.