Kamareddy SP | సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై (cyber security) అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ (Fraud ka Full Stop) కార్యక్రమాన్ని వర్చువల్​గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై (cyber security) అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ (Fraud ka Full Stop) కార్యక్రమాన్ని వర్చువల్​గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు 6 వారాల అవగాహన ప్రణాళిక కింద ప్రతి వారం ప్రత్యేక సైబర్ భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, ఆన్‌లైన్ లింకులు, అనుమానాస్పద ఫోన్​కాల్స్, డబ్బు బదిలీపై జాగ్రత్తలు, సైబర్ స్మార్ట్‌గా ఉండడం, అవగాహనను ఇతరులకు పంచడం లాంటి ప్రధాన అంశాలు ఉంటాయన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ’నేను నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని, ఆన్​లైన్​లో తెలియని లింక్​లు నొక్కనని’ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్లను ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. ప్రజలు, విద్యార్థులు, యువతను సైబర్ నేరాలపై అప్రమత్తం చేయడంలో అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...