Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Kamareddy SP | సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల నుండి రక్షణ ఇవ్వడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని జిల్లా ఎస్పీ రాజేష్​ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణంలో పోస్టర్లను ఆవిష్కరించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై (cyber security) అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ (Fraud ka Full Stop) కార్యక్రమాన్ని వర్చువల్​గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు 6 వారాల అవగాహన ప్రణాళిక కింద ప్రతి వారం ప్రత్యేక సైబర్ భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, ఆన్‌లైన్ లింకులు, అనుమానాస్పద ఫోన్​కాల్స్, డబ్బు బదిలీపై జాగ్రత్తలు, సైబర్ స్మార్ట్‌గా ఉండడం, అవగాహనను ఇతరులకు పంచడం లాంటి ప్రధాన అంశాలు ఉంటాయన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ’నేను నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని, ఆన్​లైన్​లో తెలియని లింక్​లు నొక్కనని’ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్లను ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. ప్రజలు, విద్యార్థులు, యువతను సైబర్ నేరాలపై అప్రమత్తం చేయడంలో అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Must Read
Related News