9
అక్షరటుడే, డిచ్పల్లి : Dichpalli | డిచ్పల్లి మండలం ధర్మారం (బి) వద్ద ఓ కంటైనర్ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి పార్సిళ్లతో నిజామాబాద్కు వస్తున్న కంటైనర్ శనివారం వేకువ జామున 5 గంటల సమయంలో బోల్తా పడింది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.