Talasani Srinivas Yadav | సికింద్రాబాద్​ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర : మాజీ మంత్రి తలసాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | రాష్ట్ర ప్రభుత్వం (State Government) సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​అన్నారు. మంగళవారం ఆయన పలు సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనలో సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని పోలీస్ స్టేషన్లు, డివిజన్లను మల్కాజిగిరి జోన్ కిందకు చేర్చడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్​ నగరంలో వార్డుల విభజన చేపట్టిన విషయం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | రాష్ట్ర ప్రభుత్వం (State Government) సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​అన్నారు. మంగళవారం ఆయన పలు సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు.

జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనలో సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని పోలీస్ స్టేషన్లు, డివిజన్లను మల్కాజిగిరి జోన్ కిందకు చేర్చడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్​ నగరంలో వార్డుల విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే పోలీస్​ కమిషనరేట్లలో (Police Commissionerates) సైతం మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మాట్లాడుతూ.. సికింద్రాబాద్​ను విభజిస్తే ఊరుకోమన్నారు. అయితే దానిపై సోమవారం సీఎం స్పందించారు. సికింద్రాబాద్​ను తాము ఏం మార్చడం లేదని, రాచకొండ కమిషనరేట్​ (Rachakonda Commissionerate) పేరు మాత్రమే మార్చామన్నారు. దీనిపై తాజాగా తలసాని స్పందించారు.

Talasani Srinivas Yadav | 17న శాంతిర్యాలీ

సికింద్రాబాద్​ ముక్కలు కాకుండా అందరం కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు. వ్యాపారులు, కుల సంఘాల నాయకులు కలిసి రావాలని కోరారు. ఈ నెల 17 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

కేసీఆర్​ (KCR) హయాంలో జిల్లాలు విభజించి, పోలీస్​ కమిషనరేట్లు ఏర్పాటు చేశారన్నారు. కానీ ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్​ దేని పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి సర్కిల్‌లోకి చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాలన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...