Talasani Srinivas Yadav | సికింద్రాబాద్​ పేరు మార్చే కుట్ర : మాజీ మంత్రి తలసాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వాన్ని దెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బచావో సికింద్రాబాద్ పోస్టర్లను శుక్రవారం తలసాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యలను అడ్డుకుంటామన్నారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందన్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వాన్ని దెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

బచావో సికింద్రాబాద్ పోస్టర్లను శుక్రవారం తలసాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యలను అడ్డుకుంటామన్నారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్ (Railway Station) నుంచి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు తరలి రావాలని కోరారు.

Talasani Srinivas Yadav | 220 ఏళ్ల చరిత్ర

సికింద్రాబాద్​ ప్రాంతానికి 220 ఏళ్ల చరిత్ర ఉందని తలసాని అనారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. లష్కర్ బోనాలకు (Lashkar Bonam) పెద్ద చరిత్ర ఉందన్నారు. అలాంటి సికింద్రాబాద్​ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం అన్నారు. సికింద్రాబాద్​ను టచ్​ చేయలేదని సీఎం చెబుతున్నారని, మరి నార్త్​ జోన్​ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్​గిరి కమిషనరేట్​ (Malkajgiri Commissionerate)లో ఎందుకు కలిపారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటీవల జీహెచ్​ఎంసీ పరిధిలోని కమిషనరేట్లను పునర్విభజించిన విషయం తెలిసిందే. గతంలో మూడు కమిషనరేట్లు ఉండగా.. వాటిని నాలుగుకు పెంచింది. గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్​ను తొలగించింది. దాని స్థానంలో మల్కాజ్​గిరి కమిషనరేట్​ ఏర్పాటు చేసింది. హైదరాబాద్​ కమిషనరేట్​ (Hyderabad Commissionerate) పరిధిలో కొనసాగిన పలు ప్రాంతాలను మల్కాజ్​గిరి పరిధిలోకి మార్చింది. దీనిపై బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...