ePaper
More
    HomeతెలంగాణBandi Sanjay | ‘మార్వాడీ గో బ్యాక్’​ వెనుక కుట్ర.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Bandi Sanjay | ‘మార్వాడీ గో బ్యాక్’​ వెనుక కుట్ర.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | హిందూ సమాజాన్ని చీల్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ ఆరోపించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని యూసుఫ్‌గూడలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు (Ramachandra Rao)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్​ నినాదం వెనుక కుట్ర ఉందన్నారు. కాగా సోషల్​ మీడియాలో ఇటీవల మార్వాడీ గో బ్యాక్​ అంటూ ప్రచారం జరుగుతోంది. వారు తమ వ్యాపారులను దెబ్బ తీస్తున్నారని కొందరు గో బ్యాక్​ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు.

    హిందూ సమాజం సంఘటితం అవుతుండటంతో కమ్యూనిస్ట్​ల ముసుగులో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్లాన్​ ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడీలు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారన్నారు. అధికారం కోసం, దోపిడీ కోసం రావడం లేదన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉందని బండి సంజయ్​ తెలిపారు. మన తెలంగాణ వారు సైతం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని చెప్పారు.

    Bandi Sanjay | రోహింగ్యాలపై మాట్లాడాలి

    మార్వాడీలు గో బ్యాక్​ అంటూ ప్రచారం చేస్తున్న వారు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాము రోహింగ్యా గో బ్యాక్‌ అంటూ ఆందోళనలు చేపడతామన్నారు. అనేక మంది రోహింగ్యా(Rohingya)లు వచ్చి హైదరాబాద్​లో ఉంటున్నారన్నారు. హైదరాబాద్​ ఐఎస్​ఐ అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలతో ప్రమాదం పొంచి ఉందని వారి గురించి మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

    Bandi Sanjay | ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఎలా గెలిచింది

    ఓటు చోరీ (Vote Chori) ఆరోపణలపై బండి సంజయ్​ స్పందించారు. తాము ఓట్ల చోరీ చేస్తే మాకు 240 సీట్లే వస్తాయా అని ప్రశ్నించారు. అలా అయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ పరిస్థితి ఇలా తయారు అయిందని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు.

    Bandi Sanjay | కులవృత్తులను దెబ్బ తీస్తున్నారు

    హిందువుల కుల వృత్తుల కొన్ని వర్గాల వారు దెబ్బ తీస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. హిందువుల పొట్ట కొడుతున్న వారి గురించి మాట్లాడాలని డిమాండ్​ చేశారు. హిందువుల కుల వృత్తులను కాపాడాలని తాము ఉద్యమం చేస్తామన్నారు. కాంగ్రెస్​ తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. బీహార్​లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    Latest articles

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...

    Israel | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇజ్రాయెల్​, గాజా మధ్య యుద్ధం (Israel-Gaza War) కొనసాగుతూనే ఉంది. ఈ...

    More like this

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...