Panchayat Elections | అభివృద్ధి కోసం కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) కోరారు. మహమ్మద్ నగర్ మండల (Mohammed Nagar mandal) కేంద్రంతో పాటు దూప్​సింగ్ తండా, గిర్ని తండా, గాలిపూర్, మొగ్ధుంపూర్​, కోమలంచ, తుంకిపల్లి గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. Panchayat Elections | మాజీ ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టలేదు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిహేనేళ్ల పాటు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) కోరారు. మహమ్మద్ నగర్ మండల (Mohammed Nagar mandal) కేంద్రంతో పాటు దూప్​సింగ్ తండా, గిర్ని తండా, గాలిపూర్, మొగ్ధుంపూర్​, కోమలంచ, తుంకిపల్లి గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Panchayat Elections | మాజీ ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టలేదు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్​షిండే నియోజకవర్గ అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపించలేదని, గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కూడా అందించలేకపోయారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల (welfare schemes) గురించి ప్రజలకు వివరించారు.

Panchayat Elections | గ్రామాల అభివృద్ధి కోసం..

గ్రామాల్లో అభివృద్ధి కోసం కాంగ్రెస్​ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు గ్రామాలకు మధ్య సర్పంచ్​లు వారధిగా నిలబడాలని సూచించారు. సమన్వయంతోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని స్పష్టం చేశారు. ప్రచారంలో సర్పంచ్​ అభ్యర్థులు, కాంగ్రెస్​ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...