MLA Madan Mohan Rao | కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan Rao | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్​లుగా గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో గురువారం ఆయన సమీక్షించారు. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు క్యాంప్​ కార్యాలయంలో శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan Rao | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్​లుగా గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ కోరారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో గురువారం ఆయన సమీక్షించారు. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు క్యాంప్​ కార్యాలయంలో శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలందరూ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులను ఆశీర్వదిస్తే భవిష్యత్​లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని వెల్లడించారు. అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కసరత్తు చేయాలని సూచించారు.

రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావహులు ఎవరు కూడా నిరాశపడవద్దని.. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పార్టీ మద్దతుదారులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మదన్​మోహన్ హెచ్చరించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...