Muthyala Sunil Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్​లో చేరికలు : ముత్యాల సునీల్​రెడ్డి

అక్షరటుడే, భీమ్​గల్: Muthyala Sunil Reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్​లో చేరుతున్నారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి (Muthyala Sunil Reddy) అన్నారు. మండలంలోని ఎంజీ తండాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్​ నేతలు ఆదివారం బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సునీల్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో […]

అక్షరటుడే, భీమ్​గల్: Muthyala Sunil Reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్​లో చేరుతున్నారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి (Muthyala Sunil Reddy) అన్నారు. మండలంలోని ఎంజీ తండాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్​ నేతలు ఆదివారం బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సునీల్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ (Congress party) బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ భారీ చేరికలతో ఎంజీ తండాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Muthyala Sunil Reddy | సర్పంచ్​ నేతృత్వంలో..

ఎంజీ తండా సర్పంచ్ దేగావత్ అమీనా, ఉప సర్పంచ్ దేగావత్ గణేష్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కేతావత్ హుస్సేన్, లింబాద్రి, లలిత, లక్ష్మి, లత, మలావత్ రాజు, దిగావత్ గంగు తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఎంజీ తండా వీడీసీ (VDC) పెద్దలు, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ వల్లి, పరమేష్, మోహన్, వినోద్, మోతీలాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...