Bheemgal | భీమ్​గల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ముత్యాల సునీల్​రెడ్డి

అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | భీమ్​గల్​ పట్టణాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ప్రకటించారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్​గల్ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.54 కోట్లు మంజూరు చేసిందని […]

అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | భీమ్​గల్​ పట్టణాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ప్రకటించారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్​గల్ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.54 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో భీమ్​గల్ మున్సిపాలిటీ (Bhimgal Municipality) అభివృద్ధికి నోచుకోక అన్యాయానికి గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఆ లోటును పూడుస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Bheemgal | భారీగా కాంగ్రెస్ గూటికి కార్యకర్తలు..

ఈ సందర్భంగా.. ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్​గల్ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరారు. చేరిన వారిలో పర్శ సుధాకర్, మారి పెద్దిలింగం ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​, బీజేపీ ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తోందని సునీల్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భీమ్​గల్​ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, నల్లూరి శ్రీనివాస్, సతీష్, దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...