Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | భీమ్​గల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ముత్యాల సునీల్​రెడ్డి

Bheemgal | భీమ్​గల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ముత్యాల సునీల్​రెడ్డి

భీమ్​గల్​ను అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ప్రకటించారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్​లో చేరారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | భీమ్​గల్​ పట్టణాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ప్రకటించారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్​గల్ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.54 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో భీమ్​గల్ మున్సిపాలిటీ (Bhimgal Municipality) అభివృద్ధికి నోచుకోక అన్యాయానికి గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఆ లోటును పూడుస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Bheemgal | భారీగా కాంగ్రెస్ గూటికి కార్యకర్తలు..

ఈ సందర్భంగా.. ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్​గల్ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరారు. చేరిన వారిలో పర్శ సుధాకర్, మారి పెద్దిలింగం ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​, బీజేపీ ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తోందని సునీల్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భీమ్​గల్​ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, నల్లూరి శ్రీనివాస్, సతీష్, దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News