MLC Madhusudanachari | కాంగ్రెస్​ అంటే స్కామ్​ల ప్రభుత్వం : ఎమ్మెల్సీ మధుసూదనాచారి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Madhusudanachari | కక్ష సాధింపులో భాగంగానే హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్రభుత్వం అని, కాంగ్రెస్ అంటే స్కాంల ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని బీఆర్​ఎస్​ నిలదీస్తుండటంతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని పేర్కొన్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Madhusudanachari | కక్ష సాధింపులో భాగంగానే హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్రభుత్వం అని, కాంగ్రెస్ అంటే స్కాంల ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని బీఆర్​ఎస్​ నిలదీస్తుండటంతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజం అంత కదిలి వచ్చిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అవినీతిపై హరీష్ రావు ప్రశ్నిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.

MLC Madhusudanachari | అందుకే నోటీసులు

సింగరేణి బొగ్గు గనుల కాంటాక్ట్ బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. కాంగ్రెస్​ అవినీతిని ప్రజా క్షేత్రంలో బయట పెడుతుండటంతో తమ నేతలపై కార్ రేస్ అని, విద్యుత్ కేసు అని విచారణ పేరుతో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) హామీలను నిలదీస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నాయకుడన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...