Arya Vaishya Sangham | ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో గందరగోళం

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాలకు ఆదివారం నగరంలోని మాణిక్ భవన్(Manik Bhavan) పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. కాగా సాయంత్రం 6 గంటలకు కేంద్రం గేట్లను మూసివేశారు. క్యూలైన్​లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. ఎన్నికల జరుగుతున్న క్రమంలో గందగోళం ఏర్పడింది. క్రాస్​ ఓటింగ్​ జరుగుతోందంటూ కొందరు ఆరోపణలు చేశారు. ఎన్నికల ఇన్​ఛార్జికి ఫిర్యాదు చేశారు. Arya Vaishya Sangham | ఎన్నికల […]

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాలకు ఆదివారం నగరంలోని మాణిక్ భవన్(Manik Bhavan) పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. కాగా సాయంత్రం 6 గంటలకు కేంద్రం గేట్లను మూసివేశారు. క్యూలైన్​లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. ఎన్నికల జరుగుతున్న క్రమంలో గందగోళం ఏర్పడింది. క్రాస్​ ఓటింగ్​ జరుగుతోందంటూ కొందరు ఆరోపణలు చేశారు. ఎన్నికల ఇన్​ఛార్జికి ఫిర్యాదు చేశారు.

Arya Vaishya Sangham | ఎన్నికల ఇన్​ఛార్జికి ఫిర్యాదులు..

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కేంద్రం లోపల ఉన్నారని.. పరిచయస్తులను తమ ప్యానల్​కు అనుకూలంగా దగ్గరుండి ఓటేయిస్తున్నారని కొందరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఓటింగ్ ప్రక్రియ సరైన పద్ధతిలో జరగడం లేదంటూ ఎన్నికల ఇన్​ఛార్జి బాలదాసుకు ఫిర్యాదులు కూడా చేశారు.

Arya Vaishya Sangham | సజావుగా జరగాలి: ఎమ్మెల్యే

వైశ్య సంఘం ఎన్నికల్లో క్రాస్ ఓట్లు పడుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు నినాదాలు చేశారు. ఓ మహిళ వద్ద బ్యాలెట్ బుక్కులు లభించడంతో వాటిని ఎన్నికల ఇన్​ఛార్జీలకు అందజేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రధానంగా కేంద్రంలోపల పోటీ చేసే అభ్యర్థులు ఉండడం సమంజసం కాదని సూచించారు. అలాగే ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఎన్నికల కేంద్రానికి చేరుకొని బందోబస్తును పర్యవేక్షించారు. కాగా.. ఓట్ల లెక్కింపు సోమవారం గంజ్​లో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో జరగనుంది.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...