Limbadri gutta | లింబాద్రిగుట్ట అర్చకులపై ఫిర్యాదు

అక్షరటుడే, భీమ్​గల్ : Limbadri gutta | భీమ్​గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో (Limbadrigutta Brahmotsavam) భాగంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులు, విలేకరులతో పాటు భక్తులపై దురుసుగా ప్రవర్తించిన అర్చకులపై భీమ్​గల్ జర్నలిస్ట్ యూనియన్ (Bheemgal Journalists Union) ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మోత్సవాల (Jatara Brahmotsavam) వార్తలను సేకరించడానికి వెళ్లిన విలేకరులతో నంబి వంశస్థులతో పాటు ఇతర అర్చకులు దురుసుగా ప్రవర్తించారని, అసభ్యకరంగా మాట్లాడి అవమానించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రథ భ్రమణం సందర్భంగా […]

అక్షరటుడే, భీమ్​గల్ : Limbadri gutta | భీమ్​గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో (Limbadrigutta Brahmotsavam) భాగంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులు, విలేకరులతో పాటు భక్తులపై దురుసుగా ప్రవర్తించిన అర్చకులపై భీమ్​గల్ జర్నలిస్ట్ యూనియన్ (Bheemgal Journalists Union) ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్రహ్మోత్సవాల (Jatara Brahmotsavam) వార్తలను సేకరించడానికి వెళ్లిన విలేకరులతో నంబి వంశస్థులతో పాటు ఇతర అర్చకులు దురుసుగా ప్రవర్తించారని, అసభ్యకరంగా మాట్లాడి అవమానించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రథ భ్రమణం సందర్భంగా తాడును లాగుతున్న భక్తులపై పిడి గుద్దులు కురిపించారన్నారు. అన్నసత్రంలో సేవ పేరిట కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, భక్తులను తిట్టడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్వామి కల్యాణం (Swami Kalyanam) రోజు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మీడియా వారు అన్న ప్రసాదం కోసం వెళ్తే దురుసుగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా, ప్రజలు, భక్తులతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్న అర్చకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదు మేరకు లింబాద్రిగుట్ట అర్చకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...