Homeతాజావార్తలుKTR | జూబ్లీహిల్స్​లో కారుకు, బుల్డోజర్​కు మధ్య పోటీ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | జూబ్లీహిల్స్​లో కారుకు, బుల్డోజర్​కు మధ్య పోటీ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్​ కోరారు. రహమత్​నగర్​లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : KTR | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు కారుకు, బుల్డోజర్​కు మధ్య జరుగుతున్నాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ అన్నారు. జూబ్లీహిల్స్​ పరిధిలోని రహమత్​ నగర్​లో సోమవారం బీఆర్​ఎస్​ సభలో ఆయన మాట్లాడారు.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల (Jubilee Hills by-Election) నోటిఫికేషన్​ సోమవారం వెలువడింది. నామినేషన్లు సైతం స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్​ఎస్​ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రహమత్​ నగర్​లో (Rahmat Nagar)​ భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్​లో బీఆర్​ఎస్​ గెలుపు పక్కా అన్నారు. మెజారిటీ ఎంత అన్నదే లేలాలన్నారు. ఉప ఎన్నికలు బీఆర్​ఎస్​కు కొత్త కాదని చెప్పారు.

KTR | కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలి

జూబ్లీహిల్స్​లో పోరు ప్రారంభం అయిందని కేటీఆర్​ అన్నారు. ప్రజలు రేవంత్​రెడ్డిని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. తమను మోసం చేసిన కాంగ్రెస్​కు బుద్ధి చెప్పడానికి ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్​ మోసాలను వివరించాలన్నారు. కాంగ్రెస్​ బాకీ కార్డులను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో వివరించాలన్నారు.

KTR | నెల రోజులు కష్టపడాలి

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక కారుకు బుల్డోజర్​కు మధ్య జరుగుతుందని కేటీఆర్ (KTR)​ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల ఇళ్లకు కారు రావాలా.. బుల్డోజర్​ రావాలా తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి గెలిస్తే హైడ్రా బుల్డోజర్లు ఇళ్లను కూల్చడానికి లైసెన్స్​ ఇచ్చినట్లు అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా (Hydraa) పేరుతో పేదలను రోడ్ల మీదకు తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్​ వాళ్లు జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. రాష్ట్రమంతటా ప్రజలు జూబ్లీహిల్స్​ ఎన్నికల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్​ ప్రజలు కాంగ్రెస్​కు (Congress)​ బుద్ధి చెబితే హామీలు అమలు అవుతాయన్నారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నెల రోజులు కష్టపడాలని ఆయన కోరారు.

KTR | హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి

హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్​ ఓడిపోవాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజల ఇళ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికలతో సురుకు తగలాలని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన కోరారు. లేదంటే హామీలు అమలు చేయకున్నా తననే గెలిపించారని రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇంకా ఏ పని చేయడని చెప్పారు.

KTR | నల్లా బిల్లులు కట్టొద్దు

కేసీఆర్ ప్రభుత్వంలో ఇంట్లో ఉండే నల్లా బిల్లులు మాఫీ చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. కానీ ఇప్పుడు బలవంతంగా బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు నల్లా బిల్లులు కట్టొద్దని ఆయన సూచించారు. ప్రజల వెనుక తాము ఉన్నామని చెప్పారు.