Weather Updates | తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. ఇటీవల వారం రోజుల పాటు కాస్త పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలితీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ (Cyclone Ditwah) ప్రభావంతో వారం రోజుల పాటు చలితీవ్రత తగ్గింది. మళ్లీ శుక్రవారం రాత్రి నుంచి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. ఇటీవల వారం రోజుల పాటు కాస్త పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు.

ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలితీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ (Cyclone Ditwah) ప్రభావంతో వారం రోజుల పాటు చలితీవ్రత తగ్గింది. మళ్లీ శుక్రవారం రాత్రి నుంచి కోల్డ్​ వేవ్​ ప్రారంభం అయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ఏజెన్నీ గ్రామాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Weather Updates | ఆసిఫాబాద్​లో 8.1 డిగ్రీలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా (Adilabad District)లో చలి పంజా విసరుతోంది. కొమురంభీమ్​ అసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 8.1 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్​, నిజామాబాద్, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి పెరిగింది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్​లో శనివారం ఉదయం 12.3 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12, చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Weather Updates | అప్రమత్తంగా ఉండాలి

చలి తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం ఆరు అయిందంటే బయటకు వెళ్లలేని పరిస్థితి, ఉదయం పది గంటల వరకు సైతం చలి అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలి. రాత్రిపూట ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అత్యవసరం అయితేనే రాత్రి బయటకు వెళ్లాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా రోగులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దు. గాలిపీల్చుకోవడంలో ఇబ్బంది అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...