Medaram Jathara | సీఎం రేవంత్​రెడ్డి పర్యటన.. మేడారంలో ట్రాఫిక్​ ఆంక్షలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) నేడు మేడారంలో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రేవంత్​రెడ్డి ఆదివారం పాలేరులో పర్యటిస్తారు. అనంతరం మేడారం (Medaram Jathara) వెళ్తారు. అక్కడ కేబినెట్​ మీటింగ్​లో పాల్గొంటారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి వెళ్ళే వారికి ములుగు, పస్రానార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి అనుమతించనున్నారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) నేడు మేడారంలో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రేవంత్​రెడ్డి ఆదివారం పాలేరులో పర్యటిస్తారు. అనంతరం మేడారం (Medaram Jathara) వెళ్తారు. అక్కడ కేబినెట్​ మీటింగ్​లో పాల్గొంటారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి వెళ్ళే వారికి ములుగు, పస్రానార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి అనుమతించనున్నారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా వరంగల్ వైపు తిరుగు ప్రయాణం చేయాలి.

Medaram Jathara | తొలిసారి..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంత్రివర్గ సమావేశాన్ని హైదరాబాద్ (Hyderabad) బయట నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్​ భేటీ జరగనుంది. హరిత హోటల్​లో జరిగే ఈ సమావేశం ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ మీటింగ్​లో మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా, జిల్లాల పునర్​ వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మేడారంలో రూ.260 కోట్ల శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను పునర్నిర్మించింది. కేబినెట్​ భేటీ అనంతరం సీఎం రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం గద్దెలను ఆయన ప్రారంభిస్తారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...