CM Revanth Reddy | దావోస్​కు బయలుదేరిన సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్​ (Davos)కు బయలుదేరారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF26) వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లింది.  సోమవారం ఉదయం సీఎం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్​లో హైదరాబాద్ (Hyderabad)  […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్​ (Davos)కు బయలుదేరారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటారు.

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF26) వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లింది.  సోమవారం ఉదయం సీఎం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్​లో హైదరాబాద్ (Hyderabad)  చేరుకున్నారు. దావోస్ పర్యటనలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy), ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఉంటారు.

CM Revanth Reddy | నాలుగు రోజుల పర్యటన

దావోస్‌లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల WEF సదస్సులో సీఎం పాల్గొంటారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యునిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ ప్రపంచ కార్పొరేషన్ల అధిపతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. పలు రౌండ్‌టేబుల్ చర్చల్లో కూడా పాల్గొంటారు.

CM Revanth Reddy | పెట్టుబడుల కోసం..

తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణ లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), లైఫ్ సైన్సెస్, ఉత్పాదక రంగాలపై ప్రాధాన్యత ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దావోస్‌లో ప్రపంచ వేదికపై రాష్ట్ర బలమైన వృద్ధి సామర్థ్యాన్ని, అన్ని రంగాలలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేస్తూ, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దావోస్​ పర్యటన అనంతరం సీఎం అమెరికా వెళ్తారు. తిరిగి ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకుంటారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...