Yellareddy | సీఎం రేవంత్​రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) గాంధీచౌక్ వద్ద బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారన్నారు. ఆయన కూడా ఒక […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) గాంధీచౌక్ వద్ద బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారన్నారు. ఆయన కూడా ఒక హిందువు అని మరిచిపోతున్నారని ఇలాంటి మాటలను మాట్లాడడానికి సిగ్గు ఉండాలని అసహనం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని వారు హితవు పలికారు.

రాబోయే రోజుల్లో ప్రజలు రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, నాయకులు బాలకిషన్, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షులు కాశీనాథ్, సత్యం, సీనియర్ నాయకులు బాలరాజు, మల్లయ్య, యువ నాయకులు శివ, పులి రమేష్, హరీనాథ్, దళిత మోర్చా పండరి, ఐటీసెల్ గజనాన్ పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...