HomeతెలంగాణCM Revanth | కేసీఆర్​పై మండిపడ్డ సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth | కేసీఆర్​పై మండిపడ్డ సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | బీఆర్​ఎస్​ BRS అధినేత కేసీఆర్​ KCRపై సీఎం రేవంత్​రెడ్డి  CM Revanth Reddy ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్ Warangal లో నిర్వహించిన బీఆర్​ఎస్ BRS​ రజతోత్సవ సభలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ assemblyకి రాకుండా పిల్లల్ని పంపించే కేసీఆర్​కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతూ.. పనిచేయకపోతే ఎలా అని నిలదీశారు.

కాంగ్రెస్​ పదేళ్లు అధికారంలో ఉంటుందని, కేసీఆర్​ పదేళ్లు ఫౌంహౌస్‌కే పరిమితం అవుతారని సీఎం అన్నారు. కేసీఆర్​ విద్వేషపూరిత ప్రసంగం చేసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాము ఎన్నికల హామీల అమలుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth | బీఆర్​ఎస్​ సభకు సహకరించాం

ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్​ఎస్​ సభకు తాము సహకరించినట్లు సీఎం తెలిపారు. కేసీఆర్​ కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుందన్నారు. ‘తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్‌ విలన్‌’ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలన్‌ అయ్యిందా? అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ సభకు బస్సులు ఇవ్వాలని చెప్పానని.. సభకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం గుర్తు చేశారు.