Harish Rao | ఏపీ జల దోపిడీకి సహకరిస్తున్న సీఎం రేవంత్​ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | ఏపీ జల దోపిడీకి సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్​(Polavaram-Nallamala Sagar project)కు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం సుప్రీంకోర్టు సాక్షిగా బయట పడిందన్నారు. పొలవరం–నల్లమల సాగర్​కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్​కు విచారణ అర్హత లేదని సుప్రీం తెలిపిన విషయం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | ఏపీ జల దోపిడీకి సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్​(Polavaram-Nallamala Sagar project)కు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం సుప్రీంకోర్టు సాక్షిగా బయట పడిందన్నారు.

పొలవరం–నల్లమల సాగర్​కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్​కు విచారణ అర్హత లేదని సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్​రావు స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Rangareddy project) విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఈ మాత్రం విషయం న్యాయవాది, కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా అని ప్రశ్నించారు. దీని కోసమే మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా అని ఎద్దేవా చేవారు.

Harish Rao | తెలంగాణకు ద్రోహం

మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథ అన్నారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, నీళ్లను తరలించుకు పోతుందని తెలిపారు.

తాము నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి మోసం చేశారన్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారని ఆరోపించారు. గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...