CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) తన సొంత నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇక్కడి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం (Kodangal Legislative Assembly constituency) పరిధిలోని ఆలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దౌల్తాబాద్‌(Daultabad)లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple), కొడంగల్‌(Kodangal)లోని శ్రీ […]

అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) తన సొంత నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇక్కడి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం (Kodangal Legislative Assembly constituency) పరిధిలోని ఆలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దౌల్తాబాద్‌(Daultabad)లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple), కొడంగల్‌(Kodangal)లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం (Mahalakshmi Venkateswara Swamy (Balaji) Temple), కోస్గీలోని శివాలయం(Shiva Temple), వేణుగోపాల స్వామి (Venugopala Swamy) ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు.

CM Revanth | టీటీడీ తరహాలో అభివృద్ధికి ఆమోదం..

కొడంగల్ నియోజకవర్గం(Kodangal Legislative Assembly constituency)లోని పలు ఆలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమోదించారు.

ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా మాడ వీధులు, ప్రాకార మండపం, గర్భగుడి, భూ వరాహస్వామి దేవాలయం, మహామండప డిజైన్లలను ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు.

దీనికితోడు దౌల్తాబాద్, కోస్గి Kosgi ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సైతం ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటికి పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...