Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలి

అక్షరటుడే, ఇందూరు: Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్​ ఫౌండేషన్ (Helping Hearts Foundation) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్​లో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను (Clay Ganeshas) ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాలుష్య నియంత్రణ మండలి […]

అక్షరటుడే, ఇందూరు: Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్​ ఫౌండేషన్ (Helping Hearts Foundation) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్​లో మట్టి గణపతులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను (Clay Ganeshas) ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పీవోపీ, రసాయన రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జలవనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ (Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (Revenue Employees Services Association) జిల్లా అధ్యక్షుడు రమణ్​రెడ్డి (Raman reddy), కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ప్రభు, ఆయా శాఖల అధికారులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బాన్సువాడలోని బోర్లం ప్రాథమిక పాఠశాలలో..

అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లo ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా హెచ్​ఎం గోపి మాట్లాడుతూ.. వినాయక చవితికి మట్టి గణపతులను మాత్రమే ఉపయోగించాలని, ఇవి పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అనంతరం మట్టి గణపతి తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోతంగల్​ మండల కేంద్రందలో..

అక్షరటుడే, కోటగిరి: పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోతంగల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మంగళవారం మట్టి గణపతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వామి వివేకానంద యూత్, ఈకో క్లబ్ ఆధ్వర్యంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు గణనాథులను తయారు చేశారు. ఉత్తమంగా గణేషులను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సుదాం భూమయ్య మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మట్టి గణపతులు తయారుచేసి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్, హెచ్​ఎం సాయిలు, మాజీ యూత్ అధ్యక్షులు సీతలే మోహన్, ఉపాధ్యాయులు, నాగ్ నాథ్, హన్మాండ్లు, వెంకటేశ్వర్ రెడ్డి, రామారావు, చందర్, శ్రీవాణి, ఇందిరా ప్రియ, యూత్ సభ్యులు, రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్​లో మట్టి వినాయకుల అందజేత

అక్షరటుడే, నిజాంసాగర్: మండల కేంద్రానికి చెందిన దాత సత్యనారాయణ మంగళవారం మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుడి ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. తన వంతు బాధ్యతగా మూడేళ్లుగా ఉచితంగా మట్టి వినాయకుడి ప్రతిమలను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బాన్సువాడలోని బోర్లం పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులు

పోతంగల్​ మండలంలోని జెడ్పీహెచ్​ఎస్​లో మట్టిగణపతులతో విద్యార్థులు

నిజాంసాగర్​ మండల కేంద్రంలో ఉచితంగా మట్టిగణపతులను అందజేస్తున్న దాత సత్యనారాయణ

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...