CM Revanth Reddy | మంచి వారిని సర్పంచులుగా ఎన్నుకోండి : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | గ్రామాభివృద్ధి, సమస్యలను పరిష్కరించే మంచి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేసే సర్పంచ్​ను ఎన్నుకోవాలన్నారు. రోజుకో పంచాయితీ పెట్టుకునే వ్యక్తిని గెలిపిస్తే నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎవడిని పడితే వాడిని ఎన్నుకుంటే వసూళ్లపై పడి ఉన్నదంతా గుంజుకుంటాడని హెచ్చరించారు. మంచి వాళ్లను చూసి బాధ్యత అప్పగించాలన్నారు. వరంగల్​ (Warangal) జిల్లా నర్సంపేటలో సీఎం శుక్రవారం పర్యటించారు. పలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | గ్రామాభివృద్ధి, సమస్యలను పరిష్కరించే మంచి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేసే సర్పంచ్​ను ఎన్నుకోవాలన్నారు.

రోజుకో పంచాయితీ పెట్టుకునే వ్యక్తిని గెలిపిస్తే నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎవడిని పడితే వాడిని ఎన్నుకుంటే వసూళ్లపై పడి ఉన్నదంతా గుంజుకుంటాడని హెచ్చరించారు. మంచి వాళ్లను చూసి బాధ్యత అప్పగించాలన్నారు. వరంగల్​ (Warangal) జిల్లా నర్సంపేటలో సీఎం శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy | ఢిల్లీని ఢీకొడతా..

సీఎం మాట్లాడుతూ.. ప్రజల అండ ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతానని చెప్పారు. రాష్ట్రానికి నిధులు (Funds) తీసుకొస్తానని తెలిపారు. అడగడానికి వెనుకాడదు.. రాకపోతే కొట్లాడడానికి భయపడనని స్పష్టం చేశారు. కావాల్సిన నిధులు, అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వంద సార్లు అయినా పోతానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాను, అవసరమైతే కొట్లాడుతానని స్పష్టం చేశారు.

CM Revanth Reddy | వరంగల్​ను​ అభివృద్ధి చేస్తా

హైదరాబాద్ (Hyderabad) నగరంలా వరంగల్​ను అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నగరానిరి ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు తెస్తామన్నారు. మార్చి 31లోగా పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నర్సంపేటకు మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నానని చెప్పారు.

CM Revanth Reddy | కేటీఆర్​పై విమర్శలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు (Jubilee Hills by-election) రిఫరెండం అన్న కేటీఆర్ మాటలను ప్రజలు బొంద పెట్టారని సీఎం విమర్శించారు. సిగ్గు లేకుండా మళ్లీ రోడ్లపై తిరుగుతూ కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కి వాతపెట్టాలని కోరారు. బీఆర్​ఎస్​కు 2023లో అధికారం పోయిందని, 2024 లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరని ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు వీపు మీద గుద్దినా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...