Chinese Manja | ప్రాణం తీసిన చైనా మాంజా.. సంగారెడ్డిలో విషాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chinese Manja | చైనా మాంజా ఒకరి ప్రాణం తీసుకుంది. బైక్​పై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా కోసుకోవడంతో చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఫసల్వాది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చైనా మాంజా తెగి ఓ వ్యక్తి చనిపోయాడు. బీహార్​ (Bihar)కు చెందిన అద్వైక్​ బైక్​పై వెళ్తుండగా.. చైనా మాంజా గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.  రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బీహార్​ నుంచి బతుకుదెరువు కోసం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chinese Manja | చైనా మాంజా ఒకరి ప్రాణం తీసుకుంది. బైక్​పై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా కోసుకోవడంతో చనిపోయాడు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఫసల్వాది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

చైనా మాంజా తెగి ఓ వ్యక్తి చనిపోయాడు. బీహార్​ (Bihar)కు చెందిన అద్వైక్​ బైక్​పై వెళ్తుండగా.. చైనా మాంజా గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.  రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బీహార్​ నుంచి బతుకుదెరువు కోసం అద్వైక్​​ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Chinese Manja | మారని ప్రజలు

చైనా మాంజాతో మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం నిషేధించింది. ఈ దారాన్ని ఉపయోగించవద్దని పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు పతంగుల దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా దాని విక్రయాలు ఆగడం లేదు. ముఖ్యంగా యువత, చిన్నారులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా మాంజా తెగి పది మంది వరకు గాయపడ్డారు. తాజాగా ఓ వ్యక్తి మరణించాడు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...