ePaper
More
    HomeతెలంగాణKodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. రూ.నాలుగు విలువైన రెండు వేల చదరపు గజాల భూమిని ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు. తన మామ మల్లారెడ్డి యాచారం (Yacharam) మండల కేంద్రంలో కోదండరెడ్డికి భూమి బహుమతిగా ఇచ్చారు.

    ఆ భూమిలో ఇప్పటికే రైతు మిత్ర (Rythu Mitra) కమ్యూనిటీ హాల్​ పేరిట భవనం నిర్మించారు. రైతుల అవసరాల కోసం ఆ భవనంతో పాటు రెండు వేల గజాల స్థలాన్ని ఆయన వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. ఈ మేరకు శనివారం భూమి పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. సదరు భూమి విలువ మార్కెట్​ రేటు ప్రకారం రూ.నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం. ఈ భూమి రైతులకు ఉపయోగ పడుతుందని తాను నమ్ముతున్నట్లు కోదండ రెడ్డి అన్నారు. అనంతరం రైతు సమస్యలపై మంత్రితో చర్చించారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...