Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizag Steel Plant | విశాఖ స్టీల్​ ప్లాంట్ (Vishaka Steel Plant )​ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫ్యాక్టరీ నుంచి వందశాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని తెలిపింది. స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేట్​ పరం చేస్తామని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. ఫ్యాక్టరీ రూ.35 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. అలాగే సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం దానిని ప్రైవేట్​ పరం చేయాలని నిర్ణయించింది. అయితే కార్మికులు, ఏపీకి చెందిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizag Steel Plant | విశాఖ స్టీల్​ ప్లాంట్ (Vishaka Steel Plant )​ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫ్యాక్టరీ నుంచి వందశాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని తెలిపింది. స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేట్​ పరం చేస్తామని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. ఫ్యాక్టరీ రూ.35 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. అలాగే సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం దానిని ప్రైవేట్​ పరం చేయాలని నిర్ణయించింది. అయితే కార్మికులు, ఏపీకి చెందిన నాయకులు ఆందోళనలు చేశారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చాయి.

Vizag Steel Plant | బడ్జెట్​లో భారీగా నిధులు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం బడ్జెట్​లో (Central Budget) భారీగానే నిధులు కేటాయించింది. 2024-25 బడ్జెట్‌లో రూ.8,622 కోట్లను కేటాయించిన ప్రభుత్వం, 2025-26లో రూ.3,295 కోట్లు కేటాయించింది. అంతేగాకుండా ప్రైవేట్​ పరం చేయకుండా సెయిల్ (Sail)​లో విలీనం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది.

Vizag Steel Plant | ఆ ప్రాతిపదన లేదు

విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ (Srinivas Varma) తెలిపారు. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖలో స్టీల్ ప్లాంట్​ను సెయిల్​లో విలీనం చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అలాగే ఫ్యాక్టరిలో పని చేసే ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,017 మంది వీఆర్​ఎస్​ తీసుకున్నారని తెలిపారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...