Harish Rao | నైని టెండర్లపై సీబీఐ విచారణ చేపట్టాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణ (CBI Investigation) చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలేరు సభలో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ గద్దెలను కూల్చాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్​రావు స్పందించారు. తమ పార్టీ గద్దెల జోలికొస్తే సీఎం గద్దె కూలుతుందన్నారు. తెలంగాణ ప్రజల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణ (CBI Investigation) చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలేరు సభలో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ గద్దెలను కూల్చాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్​రావు స్పందించారు. తమ పార్టీ గద్దెల జోలికొస్తే సీఎం గద్దె కూలుతుందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

Harish Rao | సైట్​ విజిట్​ అందుకే..

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే విధానాన్ని తెచ్చిందన్నారు. దీంతో టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుంచి ఈ సర్టిఫికెట్ పొందాలన్నారు. ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకున్నాడని, తర్వాత వారిని టెండర్లు రద్దు చేసుకోమని బెదిరించారని ఆరోపించారు. ఇలా తమకు అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు కట్టబెట్టారని విమర్శించారు. ఈ విధానం తెచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి తొలి టెండర్​ దక్కించుకుందన్నారు.

Harish Rao | టెండర్లు రద్దు చేయాలి

కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. దీని మీద వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన బీజేపీ పార్టీ (BJP Party), కిషన్ రెడ్డిని కోరారు. అలా చేస్తే తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సబ్మిట్ చేస్తానని చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులకు సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా మారారని విమర్శించారు. రేవంత్​రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) పరమ భక్తుడిని అని అంటారని, డిప్యూటీ సీఎం ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిని అని అంటున్నారని ఎద్దేవా చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...