Suryapet | కారు బోల్తా.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryapet | సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కారు బోల్తా పడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. సంక్రాంతి సెలవుల (Sankranti Holidays) తర్వాత తొలి రోజు బడికి వెళ్లిన ఆ టీచర్​ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం (Tungaturthi Constituency) అర్వపల్లి వద్ద […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryapet | సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కారు బోల్తా పడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది.

సంక్రాంతి సెలవుల (Sankranti Holidays) తర్వాత తొలి రోజు బడికి వెళ్లిన ఆ టీచర్​ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం (Tungaturthi Constituency) అర్వపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు బయలు దేరారు. వీరి కారు అర్వపల్లి (Arvapalli) దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. టైర్​ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రి (Suryapet Area Hospital)కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయురాలి మృతితో ఆమె పనిచేసే పాఠశాలలో విషాదం నెలకొంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...