Cabinet Meeting | కేబినెట్​ కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Meeting | మేడారం (Medaram)లో ఆదివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth Reddy)అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ (Hyderabad) బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మేడారం హరిత హోటల్​లో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్​ మీటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్​రెడ్డి మేడారంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Meeting | మేడారం (Medaram)లో ఆదివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth Reddy)అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ (Hyderabad) బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మేడారం హరిత హోటల్​లో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్​ మీటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్​రెడ్డి మేడారంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం కల్పించిన వివిధ సౌకర్యాలను సమీక్షించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యం, భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మెట్రో ఫేజ్​ 2 కు రూ. 2,787 కోట్ల కేటాయింపు

మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి కేబినెట్​లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,787 కోట్ల కేటాయింపునకు మంత్రులు ఆమోద ముద్ర వేశారు. దీనికితోడు ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

2027లో జులై 27- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాసర-భద్రాచలం వరకు గోదావరి నది వెంట ఉన్న పురాతన ఆలయాలను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని, ఎకో పార్కులు నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. మేడారంలో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...