Kamareddy | రూ.1.85 కోట్ల అప్పు చేసి.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వ్యాపారి

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో ఓ వ్యాపారి కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. రూ.1.85 కోట్ల అప్పు చేసిన ఆయన ఇంటి గోడకు లేఖ అతికించి మరీ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో సదరు వ్యాపారికి అప్పు ఇచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన ఓ వ్యాపారి రాం మందిర్ రోడ్డులో సూపర్​ మార్కెట్ (Super Market)​ నిర్వహిస్తుంటాడు. అతనికి వ్యాపారంలో రూ.కోటి 85 లక్షల అప్పులయ్యాయి. అందులో […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో ఓ వ్యాపారి కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. రూ.1.85 కోట్ల అప్పు చేసిన ఆయన ఇంటి గోడకు లేఖ అతికించి మరీ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో సదరు వ్యాపారికి అప్పు ఇచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన ఓ వ్యాపారి రాం మందిర్ రోడ్డులో సూపర్​ మార్కెట్ (Super Market)​ నిర్వహిస్తుంటాడు. అతనికి వ్యాపారంలో రూ.కోటి 85 లక్షల అప్పులయ్యాయి. అందులో తనకు ఉన్న సూపర్ మార్కెట్​కు వివిధ ఏజెన్సీల నుంచి తీసుకువచ్చిన సామగ్రికి సంబంధించిన అప్పుతో పాటు, బ్యాంక్​ లోన్​, మరొక వ్యాపారి వద్ద తీసుకున్న అప్పు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో పట్టణం విడిచి వెళ్లిపోయాడు. తనకు ఓ వ్యాపారి నుంచి ప్రాణహానీ ఉందని లేఖ రాసి మరీ వెళ్లడం పట్టణంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Kamareddy | అప్పులు తీరుస్తా..

కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు, సెక్రెటరీకి సదరు వ్యాపారి లేఖ రాసి, ఇంటి గోడకు అతికించాడు. బ్యాంకు, ఇతర వ్యక్తులు, ఏజెన్సీతో సహా మరొక రైస్ మిల్ వ్యాపారి వద్ద అప్పులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. రైస్ మిల్ వ్యాపారి తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించాడు. అందుకే కామారెడ్డి వదిలి వెళ్లిపోతున్నామని తెలిపాడు. ఆస్తులు అమ్మి అందరి అప్పులు సెటిల్ చేస్తానని లేఖలో పేర్కొన్నారు.

తన ప్రాపర్టీ కొనడానికి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడని, డబ్బులు రావడానికి సమయం పడుతుందని రాశాడు. డబ్బులు రాగానే అప్పులు తీర్చేస్తానని పేర్కొన్నారు. తనకు కొంత సమయం ఇవ్వాలని, అప్పులన్నీ తీర్చేసి మళ్లీ కామారెడ్డిలో వ్యాపారం కొనసాగిస్తానని లేఖలో వెల్లడించారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...