electric vehicle | అధిక మైలేజీ పేరుతో మోసం.. నియాన్‌ మోటార్స్, మహీంద్రాకు భారీ జరిమానా

అక్షరటుడే, హైదరాబాద్: electric vehicle : మైలేజీ విషయంలో వినియోగదారుడిని మహీంద్రా అండ్‌ మహీంద్రా, నియాన్‌ మోటార్స్​ సంస్థలు మభ్య పెట్టినట్లు నిర్ధారించిన హైదరాబాద్‌ కమిషన్‌-2.. ఆ సంస్థలకు భారీగా జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడి మానసిక వేదనను పరిగణనలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన 45 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేకుంటే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం […]

అక్షరటుడే, హైదరాబాద్: electric vehicle : మైలేజీ విషయంలో వినియోగదారుడిని మహీంద్రా అండ్‌ మహీంద్రా, నియాన్‌ మోటార్స్​ సంస్థలు మభ్య పెట్టినట్లు నిర్ధారించిన హైదరాబాద్‌ కమిషన్‌-2.. ఆ సంస్థలకు భారీగా జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడి మానసిక వేదనను పరిగణనలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన 45 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేకుంటే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

జీహెచ్​ఎంసీ పరిధిలోని బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి సతీశ్​ కుమార్‌ తాడ్‌బండ్‌లోని నియాన్‌ మోటార్స్‌లో మార్చి, 2023లో ఎక్స్‌యూవీ – 400 విద్యుత్తు వెహికల్​ను రూ.19,63,306కు కొనుగోలు చేశారు. సంప్రదింపుల సమయంలో 100 శాతం ఛార్జింగ్‌తో 456 కిలోమీటర్లు, 80 శాతంతో 364 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీవారు చెప్పారు. కానీ, 240 కిలోమీటర్లకు మించి మైలేజీ రాకపోవడంతో నియాన్‌ మోటార్స్, తయారీ సంస్థల ప్రతినిధులను సతీశ్​ కుమార్‌ సంప్రదించారు.

కారును లోటు పాట్ల పరిశీలన నిమిత్తం సర్వీసింగ్‌ సెంటర్‌కు పంపినా.. మైలేజీ పెరగలేదు. దీంతో ఎక్స్‌ఛేంజ్‌లో మరో వాహనాన్ని ఇవ్వాలని సతీశ్​ కుమార్‌ అభ్యర్థిస్తే వారు పట్టించుకోలేదు. ఆవేదన చెందిన సతీశ్​ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థలు ఫిర్యాదు దారుడి ఆరోపణలను ఖండించాయి. కమిషన్​ ఆదేశాల మేరకు కారు మైలేజీ విషయంలో సంయుక్త అధ్యయనం చేస్తే.. టెస్ట్‌ డ్రైవ్‌లో 11 శాతం బ్యాటరీ ఖర్చుతో 23.7 కి.మీ.గా వచ్చింది. దీంతో ప్రతివాద సంస్థలకు హైదరాబాద్‌ కమిషన్‌-2 భారీ జరిమానా విధించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...