అక్షరటుడే, డిచ్పల్లి: MP Aravind | డిచ్పల్లి-ఘన్పూర్ గ్రామాల మధ్య అండర్ గ్రౌండ్ వంతెన (Underground Bridge) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఘన్ పూర్ వీడీసీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఘన్పూర్ మీదుగా వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ను (MP Dharmapuri Arvind) కలిసి వినతిపత్రం అందజేశారు.
రైల్వేవంతెన లేక ఘన్పూర్, ముల్లంగి, ఇస్లాంపుర, ఖిల్లా డిచ్పల్లి, పోలీస్ క్యాంప్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతున్నారని ఎంపీకి వివరించారు. రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ వంతెన (Foot Over Bridge) లేకపోవడంతో ప్రయాణికులు, స్థానిక గ్రామాల ప్రజలు రైల్వేట్రాక్ దాటి ప్రమాదాల బారిన పడుతున్నారని దృష్టికి తెచ్చారు. వెంటనే అండర్ గ్రౌండ్ వంతెనతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుకు చొరవ చూపాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, మండల నాయకులు సతీష్ రెడ్డి, చంద్రకాంత్, తదితరులున్నారు.
