MP Aravind | అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించండి

అక్షరటుడే, డిచ్​పల్లి: MP Aravind | డిచ్​పల్లి-ఘన్​పూర్ గ్రామాల మధ్య అండర్ గ్రౌండ్ వంతెన (Underground Bridge) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఘన్ పూర్ వీడీసీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఘన్​పూర్ మీదుగా వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్​ను ​(MP Dharmapuri Arvind) కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వేవంతెన లేక ఘన్​పూర్, ముల్లంగి, ఇస్లాంపుర, ఖిల్లా డిచ్​పల్లి, పోలీస్ క్యాంప్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ట్రాఫిక్​తో సతమతమవుతున్నారని ఎంపీకి వివరించారు. రైల్వే […]

అక్షరటుడే, డిచ్​పల్లి: MP Aravind | డిచ్​పల్లి-ఘన్​పూర్ గ్రామాల మధ్య అండర్ గ్రౌండ్ వంతెన (Underground Bridge) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఘన్ పూర్ వీడీసీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఘన్​పూర్ మీదుగా వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్​ను ​(MP Dharmapuri Arvind) కలిసి వినతిపత్రం అందజేశారు.

రైల్వేవంతెన లేక ఘన్​పూర్, ముల్లంగి, ఇస్లాంపుర, ఖిల్లా డిచ్​పల్లి, పోలీస్ క్యాంప్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ట్రాఫిక్​తో సతమతమవుతున్నారని ఎంపీకి వివరించారు. రైల్వే స్టేషన్​లో ఫుట్ ఓవర్ వంతెన (Foot Over Bridge) లేకపోవడంతో ప్రయాణికులు, స్థానిక గ్రామాల ప్రజలు రైల్వేట్రాక్ దాటి ప్రమాదాల బారిన పడుతున్నారని దృష్టికి తెచ్చారు. వెంటనే అండర్ గ్రౌండ్ వంతెనతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుకు చొరవ చూపాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, మండల నాయకులు సతీష్ రెడ్డి, చంద్రకాంత్, తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...