Kukatpally MLA | కవితపై బీఆర్​ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మంత్రి పదవులు అమ్ముకున్నారని ఆరోపణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally MLA | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై (Kalvakuntla Kavitha) కూకట్​పల్లి బీఆర్​ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అవినీతి చిట్టా తన వద్ద ఉందన్నారు. కవితకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కంటే పెద్ద ఇల్లు ఉందని, అది ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వంతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally MLA | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై (Kalvakuntla Kavitha) కూకట్​పల్లి బీఆర్​ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అవినీతి చిట్టా తన వద్ద ఉందన్నారు. కవితకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కంటే పెద్ద ఇల్లు ఉందని, అది ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వంతో పాటు, గత బీఆర్ఎస్​ పాలనపై ఆమె విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు టార్గెట్​గా అనేక ఆరోపణలు చేశారు. అలాగే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను సైతం వదలడం లేదు. సోమవారం కవిత కూకట్​పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కృష్ణారావుపై (BRS MLA Krishna Rao) ఆమె ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలపై మంగళవారం కూకట్​పల్లి ఎమ్మెల్యే స్పందించారు. కవిత జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

 Kukatpally MLA | కేజ్రీవాల్​ను ఆగం చేసింది

తెలంగాణలో తిరగడానికి కవితకు అసలేం హక్కు ఉందని కృష్ణారావు ప్రశ్నించారు. ఢిల్లీలో మంచి పేరు ఉన్న కేజ్రీవాల్​ని ఆగం చేశారన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో (Delhi Liquor Scam) కవిత అరెస్ట్​ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్​లను నాశనం చేసే కవిత ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘మర్యాదతో చెప్తున్నా’ ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కవిత మంచి వ్యక్తి కాకపోవడంతోనే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. పదేళ్లు అధికారం అనుభవించనప్పుడు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు బీసీలను కాపాడటానికి ఆమె ఉందా అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ. కోట్లకు కోట్లు సంపాదించారని ఆరోపించారు. కవిత భర్తకు బాలనగర్​లో 36 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

 Kukatpally MLA | మంత్రి పదవులు అమ్ముకున్నారు

కవిత చరిత్ర తనకు మొత్తం తెలుసని మాధవరం అన్నారు. ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్​ (KCR)పై ఉన్న అభిమానంతో తాము ఇన్ని రోజులు కవితపై మాట్లాడలేదన్నారు. ఉద్యమం చేసి పార్టీ కోసం పని చేస్తున్న హరీశ్​రావు (Harish Rao)ను పార్టీ నుంచి పంపించాలని కవిత కుట్రలు చేశారన్నారు. కవిత భర్త అక్రమాల వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...