Mla Prashanth reddy | ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్​ఎస్​లో చేరికలు : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

అక్షరటుడే, భీమ్​గల్​: Mla Prashanth reddy | ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్​ఎస్​లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ (Congress party) ముఖ్య నాయకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్‌లకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. […]

అక్షరటుడే, భీమ్​గల్​: Mla Prashanth reddy | ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్​ఎస్​లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ (Congress party) ముఖ్య నాయకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్‌లకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Mla Prashanth reddy | బీఆర్​ఎస్​ హయాంలోనే అభివృద్ధి..

ఈ సందర్భంగా ప్రశాంత్​రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) నాయకత్వంలో పదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే తాము కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్​లో చేరినట్లు నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ చౌట్​పల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, కర్నె మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...