BRS | పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్​ఎస్​.. త్వరలో ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | కొంతకాలంగా సైలెన్స్​గా ఉన్న బీఆర్ఎస్ (BRS party)​ పార్టీ మళ్లీ పోరుబాట పట్టనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్​ నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడానికి గులాబీ బాస్​ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | కొంతకాలంగా సైలెన్స్​గా ఉన్న బీఆర్ఎస్ (BRS party)​ పార్టీ మళ్లీ పోరుబాట పట్టనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్​ నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడానికి గులాబీ బాస్​ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని బీఆర్ఎస్‌ నిర్ణయం తీసుకుంది.

BRS | కార్యకర్తల్లో అయోమయం

కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission) విచారణ, ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone tapping case), ఫార్ములా ఈ కారు రేస్​ కేసులో కేటీఆర్​ విచారణ తదితర అంశాలతో బీఆర్​ఎస్​లో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కవిత ఎపిసోడ్​తో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు సైలెన్స్​గా ఉండిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR))​ అధికారం పోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అంతగా వెళ్లడం లేదు. ఫామ్​హౌస్​కే పరిమితం అయినా గులాబీ బాస్​ చివరి సారి బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో మాట్లాడారు. దీంతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి మరో ఉద్యమం చేపట్టాలని బీఆర్​ఎస్​ భావిస్తోంది.

BRS | సాగునీటి ప్రాజెక్ట్​లపై..

తెలంగాణ ఉద్యమంతో అంచలంచెలుగా ఎదిగి పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్​ఎస్​.. మళ్లీ ఉద్యమం ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట సాగిన ఉద్యమంతో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా బీఆర్ఎస్​ సాగునీటి ప్రాజెక్ట్​లతో పాటు రైతాంగ సమస్యలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.

కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ యోచిస్తోంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ప్రజలకు వివరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​తో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ త్వరలో ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...