Indiramma House | ఇందిరమ్మ ఇంటి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma House | రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma House scheme) తీసుకు వచ్చింది. తొలి విడతలో నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న వారికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు తావు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని, అనర్హులని తెలితే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma House | రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma House scheme) తీసుకు వచ్చింది. తొలి విడతలో నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న వారికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు తావు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని, అనర్హులని తెలితే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఎవరైన అధికారులు, నాయకులు ప్రజల నుంచి డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు. అయినా కూడా కొందరు అధికారులు, నాయకులు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు పట్టుకున్నారు.

Indiramma House | బిల్లుల మంజూరు కోసం..

మంచిర్యాల జిల్లా (Manchiryal district) కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గొర్లపల్లి రాజ్ కుమార్ పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయిన మేరకు బిల్లు కోసం ఫొటో తీసి యాప్​లో నమోదు చేస్తే లబ్ధిదారుకు రూ.1.40 లక్షల బిల్లు వస్తుంది. దీనికోసం పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) రాజ్​కుమార్​ రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు. బాధితులు బతిమిలాటడంతో రూ.5 వేలకు ఒప్పుకున్నాడు. అనంతరం మహిళ భర్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి శుక్రవారం రాత్రి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...