Karnataka | కర్ణాటకలో కొనసాగుతున్న బ్రేక్​ఫాస్ట్​ రాజకీయాలు.. సీఎం పదవి మార్పుపై ఉత్కంఠ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి మార్పు సస్పెన్స్​ వీడటం లేదు. ఈ క్రమంలో బ్రేక్​ఫాస్ట్ రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (Deputy CM DK Shivakumar) ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం వచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ కోసం ఆయన వెళ్లారు. ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ రాజకీయాలు నడుస్తున్న వేళ బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి మార్పు సస్పెన్స్​ వీడటం లేదు. ఈ క్రమంలో బ్రేక్​ఫాస్ట్ రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (Deputy CM DK Shivakumar) ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం వచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ కోసం ఆయన వెళ్లారు. ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ రాజకీయాలు నడుస్తున్న వేళ బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అప్పటి నుంచే పవర్ షేరింగ్ పంచాయితీ మొదలైంది. మిగతా రెండున్నరేళ్లు డీకే. శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం డీకే.శివకుమార్​ను సీఎం బ్రేక్ ఫాస్ట్​కు ఆహ్వానించారు. తాజాగా డీకే తన ఇంటికి సీఎంను అల్పాహారం కోసం ఆహ్వానించారు.

Karnataka | విబేధాలు లేవని స్పష్టం

ఇటీవల సీఎం (CM Siddaramaiah) ఇంట్లో బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఇటీవల వ్యాఖ్యలు చేసిన పరమేశ్వర తాజాగా వెనక్కి తగ్గారు. నాయకులు అల్పాహారం కోసం మళ్ళీ కలిసి రావడం మంచి విషయమన్నారు. గత నెల రోజులుగా జరిగిన దానికి శాంతియుత పరిష్కారం కావాలి అని పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...