Mla Bhupathi Reddy | కాంగ్రెస్‌లో చేరిన బ్రాహ్మణపల్లి సర్పంచ్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | జక్రాన్​పల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ (Brahmanapalli Sarpanch) శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్​పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (Mla Bhupathi Reddy) క్యాంప్​ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో (Gram Panchayat general elections) స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందిన శివప్రసాద్‌తో […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | జక్రాన్​పల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ (Brahmanapalli Sarpanch) శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్​పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (Mla Bhupathi Reddy) క్యాంప్​ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో (Gram Panchayat general elections) స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందిన శివప్రసాద్‌తో పాటు యూత్ సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాయని కాంగ్రెస్‌లో చేరడానికి కారణమని వారు తెలిపారు.

Mla Bhupathi Reddy | కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

డిచ్​పల్లి మండలం (Dichpally mandal) కమలాపూర్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ ఛైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్​ ఛైర్మన్ రామచందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు టి.సాగర్, పవన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...