Bonalu Festival | గోల్కొండ కోటలో బోనాల సందడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bonalu Festival | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో అమ్మవార్లకు ఏటా అంగరంగ వైభవంగా బోనాలు (Bonalu) సమర్పిస్తారు. గోల్కొండ కోట (Golkonda Fort)లో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో మహానగరంలో బోనాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26న గురువారం ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా గోల్కొండ కోటలోని అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పలువురు ప్రముఖుల సైతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bonalu Festival | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో అమ్మవార్లకు ఏటా అంగరంగ వైభవంగా బోనాలు (Bonalu) సమర్పిస్తారు. గోల్కొండ కోట (Golkonda Fort)లో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో మహానగరంలో బోనాలు ప్రారంభం అయ్యాయి.

ఈ నెల 26న గురువారం ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా గోల్కొండ కోటలోని అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పలువురు ప్రముఖుల సైతం హాజరై బోనం మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆదివారం సందర్భంగా నేడు కూడా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. దీంతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పోతరాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపుతో కళకళలాడింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

బోనాల పండుగతో మహా నగరంలో నెల రోజులపాటు ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. జూన్​ 26న ప్రారంభమైన బోనాలు జూలై 24 వరకు కొనసాగనున్నాయి. సికింద్రాబాద్​, లాల్‌ దర్వాజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాకుండా నగరంలోని పలు ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకుంటారు. దీంతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...