Bomb Threat | పాఠశాలలకు బాంబు బెదిరింపులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat | పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నోయిడా (Noida), అహ్మదాబాద్​ (Ahmedabad)లోని స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్​ వచ్చాయి. అహ్మదాబాద్‌లోని చాలా బడులకు బాంబు బెదిరింపులు మెయిల్ ద్వారా వచ్చాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Crime Branch Police) శుక్రవారం తెలిపారు. దీంతో పోలీసులు, బాంబ్​ స్క్వాడ్​, ఫోరెన్సిక్ విభాగం దర్యాప్తు ప్రారంభించాయి. మరోవైపు నోయిడాలోని శివ్ నాడార్ పాఠశాల (Shiv Nadar School)కు ఇమెయిల్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat | పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నోయిడా (Noida), అహ్మదాబాద్​ (Ahmedabad)లోని స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్​ వచ్చాయి.

అహ్మదాబాద్‌లోని చాలా బడులకు బాంబు బెదిరింపులు మెయిల్ ద్వారా వచ్చాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Crime Branch Police) శుక్రవారం తెలిపారు. దీంతో పోలీసులు, బాంబ్​ స్క్వాడ్​, ఫోరెన్సిక్ విభాగం దర్యాప్తు ప్రారంభించాయి. మరోవైపు నోయిడాలోని శివ్ నాడార్ పాఠశాల (Shiv Nadar School)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో శుక్రవారం పాఠశాలను మూసి వేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపారు. శివ్ నాడార్ పాఠశాలతో పాటు, బాల భారతి పాఠశాల, కేంబ్రిడ్జ్ పాఠశాల (Cambridge School)కు సైతం బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా స్కూళ్లను మూసివేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ప్రైవేట్ పాఠశాలలకు పంపిన బెదిరింపు ఇమెయిల్‌ల గురించి సమాచారం అందగానే తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ అధికారులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబ్బంది, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక దళం, డాగ్ స్క్వాడ్, BDDS బృందాన్ని వెంటనే సైట్‌లలో మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదన్నారు. మరోవైపు సైబర్ పోలీసులు (Cyber ​​Police) ఈ మెయిల్​ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...