Bomb Threat Call | ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat Call | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఇటీవల ఎర్రకోట వద్ద కారు బాంబు పేలి 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ఉగ్రవాదులను (Terrorists) కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat Call) రావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలోని పలు కోర్టులు, విద్యాసంస్థల లక్ష్యంగా కొందరు దుండగులు ఈమెయిల్‌ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat Call | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఇటీవల ఎర్రకోట వద్ద కారు బాంబు పేలి 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ఉగ్రవాదులను (Terrorists) కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్​ చేస్తున్నాయి.

ఈ క్రమంలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat Call) రావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలోని పలు కోర్టులు, విద్యాసంస్థల లక్ష్యంగా కొందరు దుండగులు ఈమెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. 4 కోర్టులు, రెండు సీఆర్​పీఎఫ్​ సూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాకేత్, రోహిణి, ద్వారక, పాటియాలా కోర్టులకు బెదిరింపులు రావడంతో సిబ్బంది, లాయర్లు బయటకు వచ్చారు. అనంతరం డాగ్ స్క్వాడ్ (Dog Squad), బాంబు స్క్వాడ్​ (Bomb Squad) తో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు దృష్ట్యా సాకేత్ కోర్టు బార్ కార్యదర్శి న్యాయవాది అనిల్ బసోయా మాట్లాడుతూ, కోర్టు పనిని రెండు గంటల పాటు నిలిపివేసినట్లు తెలిపారు.

Bomb Threat Call | పాఠశాలలకు..

దేశ రాజధానిలోని రెండు CRPF పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల తర్వాత కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. ప్రశాంత్ విహార్ మరియు ద్వారకలోని CRPF పాఠశాల (CRPF Schools) ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)కి ఫోన్ చేసి పేర్కొన్నాడు. దీంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను బయటకు పంపి బాంబ్​స్క్వాడ్​తో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. దీంతో ఇవి నకిలీ బెదిరింపులని అధికారులు తేల్చారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...