Banswada BJP | దేశాభివృద్ధి కోసమే సంక్షేమ పథకాల అమలు

అక్షరటుడే, బాన్సువాడ: Banswada BJP | ప్రధాని మోదీ (PM Modi) ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్ తిరిగి బీజేపీలో చేరగా.. గురువారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada BJP | ప్రధాని మోదీ (PM Modi) ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్ తిరిగి బీజేపీలో చేరగా.. గురువారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకుడు పీఎం నరేంద్ర మోదీ అని కొనియాడారు.

రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతారని సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర్ సాయిలు, కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, హనుమాన్ యాదవ్, హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, దత్తు, సీనియర్ నాయకులు సాయిబాబా, దత్తు సాయి రెడ్డి, లక్ష్మణ్, సురేష్, సంజీవ్, విశ్వనాధ్, విఠల్ రాజిరెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...