Bheemgal | భీమ్‌గల్‌లో బీజేపీ కార్యశాల

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యశాల నిర్వహించారు. మండలాధ్యక్షుడు ఆరే రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండల ఇన్‌ఛార్జి నోముల నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ (PM Modi) జన్మదిన సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 17న రక్తదాన శిబిరం (blood donation camp), 18న స్వచ్ఛభారత్, 25న దీన్‌ దయాళ్‌కు నివాళులర్పించి మొక్కలు […]

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యశాల నిర్వహించారు. మండలాధ్యక్షుడు ఆరే రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండల ఇన్‌ఛార్జి నోముల నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ (PM Modi) జన్మదిన సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

17న రక్తదాన శిబిరం (blood donation camp), 18న స్వచ్ఛభారత్, 25న దీన్‌ దయాళ్‌కు నివాళులర్పించి మొక్కలు నాటాలని సూచించారు. 28న విశిష్ట వ్యక్తులకు సన్మానం, అక్టోబర్‌ 2న గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేయాలన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భూక్యా మోహన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కార్యదర్శులు లక్ష్మీ నారాయణ, రజినీకాంత్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లింబాద్రి నాయక్, సీనియర్‌ నాయకులు లింగం, పురస్తు దినేష్, గంగాధర్‌ గౌడ్, సీహెచ్‌ రాజేశ్వర్, దేవి శెట్టి శ్రీనివాస్, బద్దం సుజిత్‌ రెడ్డి, శక్తి లక్ష్మణ్, కొట్టాల అశోక్, బదావత్‌ ప్రకాష్‌ నాయక్, సుదర్శన్, తోట రమేష్, మండల పదాధికారులు, బూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...