BMC Results | ముంబై మున్సిపల్​ ఎన్నికల్లో బీజేపీ, శివసేన జోరు..

అక్షరటుడే, వెబ్​డెస్క్: BMC Results | మహారాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల్లో (Maharashtra municipal elections) అధికార బీజేపీ, శివసేన కూటమి జోరు కొనసాగింది. కీలకమైన బృహన్​ ముంబై కార్పొరేషన్​ ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ మార్క్​ను దాటింది. ముంబై మున్సిపల్ ఎన్నికలు (Mumbai municipal elections) గురువారం జరిగాయి. బీఎంసీలో 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: BMC Results | మహారాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల్లో (Maharashtra municipal elections) అధికార బీజేపీ, శివసేన కూటమి జోరు కొనసాగింది. కీలకమైన బృహన్​ ముంబై కార్పొరేషన్​ ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ మార్క్​ను దాటింది.

ముంబై మున్సిపల్ ఎన్నికలు (Mumbai municipal elections) గురువారం జరిగాయి. బీఎంసీలో 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం అయింది. సాయంత్రం వరకు బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి 114 స్థానాల మెజారిటీ మార్కును దాటింది. బీఎంసీ ఫలితాల లెక్కింపు కొనసాగుతుండగా, లెక్కింపులో, ఈవీఎంలలో లోపాల కారణంగా కనీసం రెండు వార్డుల ఫలితాలను నిలిపివేశారు.

BMC Results | పూర్తి మెజారిటీ సాధిస్తాం

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ (CM Devendra Fadnavis) మాట్లాడుతూ.. పూర్తి మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం 6:30 గంటల వరకు 121 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అందులో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. మహాయుతి కూటమి గెలుపుతో కలిపి 120కి పైగా స్థానాల్లో లీడ్​లో ఉంది. ముంబై అభివృద్ధికి ప్రజాతీర్పు ఇవ్వబడిందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పేర్కొన్నారు.

BMC Results | నాలుగేళ్లు ఆలస్యంగా..

నాలుగేళ్ల జాప్యం తర్వాత గురువారం జరిగిన బీఎంసీ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికలు 2017లో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు 2022లో జరగాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణాలలో కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) ఒకటి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒంటరిగా ఓటీ చేశాయి. అయితే ఫలితాల అనంతరం శివసేనతో కలిసి బీజేపీ మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. తాజాగా శివసేన (సిందే)తో కలిపి మరోసారి అధికారం దిశగా సాగుతోంది. దీంతో కాషాయ శ్రేణుల్లో జోష్​ నెలకొంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...