CP Sai Chaitanya | పాతనేరస్థులను బైండోవర్​ చేయాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్​ చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్​ను (Jakranpally Police Station) మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్​ను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​లో రికార్డులు, బ్యారక్​లు […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్​ చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్​ను (Jakranpally Police Station) మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్​ను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​లో రికార్డులు, బ్యారక్​లు తనిఖీ చేశారు. ఇన్వేస్టిగేషన్ కేసుల విచారణలో పక్కా ప్రణాళికతో వెళ్లాలని సూచించారు.

CP Sai Chaitanya | మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్​స్టేషన్​కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతి దరఖాస్తును ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని.. రిజిస్ట్రర్​లో కూడా నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్​ క్రైం (cyber crimes) నేరాలు జరుగుతున్నందున యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విలేజ్​ పోలీస్​ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం అలర్ట్​గా ఉండాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా హెడ్​క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆర్నెళ్ల కొకసారి హెల్త్​ చెకప్​ చేయించుకోవాలని పేర్కొన్నారు. జక్రాన్​పల్లి ఎస్సై మహేశ్ (Jakranpally SI Mahesh)​, సిబ్బంది పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...