Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పాతనేరస్థులను బైండోవర్​ చేయాలి: సీపీ సాయిచైతన్య

CP Sai Chaitanya | పాతనేరస్థులను బైండోవర్​ చేయాలి: సీపీ సాయిచైతన్య

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్థులను బైండోవర్​ చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్​ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్​ చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్​ను (Jakranpally Police Station) మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్​ను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​లో రికార్డులు, బ్యారక్​లు తనిఖీ చేశారు. ఇన్వేస్టిగేషన్ కేసుల విచారణలో పక్కా ప్రణాళికతో వెళ్లాలని సూచించారు.

CP Sai Chaitanya | మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్​స్టేషన్​కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతి దరఖాస్తును ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని.. రిజిస్ట్రర్​లో కూడా నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్​ క్రైం (cyber crimes) నేరాలు జరుగుతున్నందున యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విలేజ్​ పోలీస్​ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం అలర్ట్​గా ఉండాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా హెడ్​క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆర్నెళ్ల కొకసారి హెల్త్​ చెకప్​ చేయించుకోవాలని పేర్కొన్నారు. జక్రాన్​పల్లి ఎస్సై మహేశ్ (Jakranpally SI Mahesh)​, సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News